Fire @ Nallagonda | నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో గురువారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఊకొండి-రతిపల్లి గ్రామాల మధ్య కాల్పుల కలకలం జరిగింది. బ్రాహ్మణ వెల్లంల వాసి లింగాస్వామి అనే వ్యక్తి మునుగోడులో కూల్డ్రింక్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. బైక్పై వెళుతున్న లింగాస్వామిని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తున్నది. అటుపై అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన లింగాస్వామిని నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.