వరంగల్: మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తున్నారని వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Enumamula Market) రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. రూ.రూ.25 వేల వండర్ హాట్ రకాన్ని రూ.15 వేలకు కొనుగోలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ గేటు ముందు బేఠాయించడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.