తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలోని గడపగడప చర్చిస్తున్నది. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ నిదర్శనంగా నిలుస్తున్నది. దేశంలో మతఛాందసవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి, సెక్యులరిజాన్ని నెలకొల్పడం బీఆర్ఎస్తోనే సాధ్యం.
-మహారాష్ట్ర నేతలు
CM KCR | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్నదని, యావత్దేశం రాష్ట్రంవైపు చూస్తున్నదని తెలిపారు. మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన మైనార్టీ నేతలు ఆదివారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ప్రజలు ఆగం కావొద్దని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని, అక్కడే ఎన్నో నదులు పుట్టి ప్రవహిస్తున్నా పట్టణాలు, గ్రామాలకు నీళ్లు లేక ఎందుకు గోసపడుతున్నాయో, అందుకు కారణం ఎవరో ప్రజలు గుర్తించాలని కోరారు. మనం ఓట్లేస్తూ పోతుంటే, వారు గెలుస్తూ పోతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా మన ఆలోచనతీరు మారాలని సూచించారు.
ఫూలే, అంబేదర్ వంటి ఎందరో సంఘసంసర్తలు, మేధావులు పుట్టిన నేల నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక వెనుబాటుకు గురికావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారం ఇస్తూ పోతున్నా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని, ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదంతో ఉద్యమించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. మతం పేరుతో పబ్బం గడుపుకోవడమే బీజేపీ వ్యూహమని విమర్శించారు. తెలంగాణ పథకాలను అమలు చేస్తే అక్కడి పార్టీలే దివాలా తీస్తాయి కానీ, ప్రజలు కాదని, వారి జీవితాల్లో దీపావళి వెలుగులు ప్రసరిస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్తోనే ప్రగతి
మైనార్టీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలోని గడపగడప చర్చిస్తున్నదని తెలిపారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ నిదర్శనంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో మతఛాందసవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి, సెక్యులరిజాన్ని నెలకొల్పడం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు అహరహం శ్రమిస్తామని తేల్చి చెప్పారు.
పార్టీలో చేరికలు ఇలా
సంఘర్ష్ కామ్గార్ కర్మాచారి యూనియన్, ఆల్ ఇండియా సినీ వరర్స్ అసోసియేషన్, అన్నా మాథాడి ట్రాన్స్పోర్ట్ కామ్గార్ యూనియన్ వంటి సంస్థలతో పాటు సంస్థ అధ్యక్షుడు సంజయ్ దినకర్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోలాపూర్ నుంచి వల్యాల నగేశ్ నేతృత్వంలో ముస్లిం నేతలు, బీడ్ జిల్లా నుంచి ఫూల్చంద్ కరాడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముల్లర్, మహారాష్ట్ర కిసాన్ సెల్ ప్రెసిడెంట్ సంజయ్ పాటిల్ పార్టీలో చేరారు. వీరితోపాటు ముస్లిం నాయకులు, జెడ్పీ, గ్రామ పంచాయతీ సభ్యులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోండ్గే, మాణిక్ కదమ్ తదితరులు పాల్గొన్నారు.