Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి( Lakshmi Narasimha Swamy ) ఆలయ రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఆప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోపురంపై సూర్యకిరణాలు( Sun rays ) పడిన ఫొటోను ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసింది.
వసంత రుతువులో సూర్యకాంతి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తాకినప్పుడు ఇలా ఉంటుందని పేర్కొన్నది. ఈ చిత్రాన్ని పిక్ ఆఫ్ ది డేగా పరిగణిస్తున్నామంటూ తెలిపింది. ఇంతటి అద్భుతమైన ఫొటోను క్లిక్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆలయం అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Sri Lakshmi Narasimha Swamy Temple on a sunny day of spring is all we’ve wanted to see for #PicOfTheDay! We thank Harikrishna Narla for this cheerful click.
Credits: itzharrykrrish (Instagram)#AmritMahotsav pic.twitter.com/N0gGbgmGYk
— Ministry of Culture (@MinOfCultureGoI) March 29, 2023