వనపర్తి : అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..కళాశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల జ్ఞాన సంపద భవిష్యత్తు తరాలకు అవసరం అన్నారు.
కళాశాల అభివృద్ధి కోసం రూ.20కోట్ల నిధులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులు దేశానికి ఆదర్శంగా నిలువాలన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాలనుఆదర్శమైన కళాశాలగా తీర్చిదిద్దుతామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.