నల్లగొండ : జిల్లా పర్యటనలో భాగంగా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.
కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఫిష్ అండ్ గోట్ సంస్థ చైర్మన్ దూదిమెట్ల బలరాజ్ యాదవ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.