హైదరాబాద్, సెప్టెంబర్ 29 : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెప్రగతి, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశంలోనే నెంబర్ వన్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లిని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతి అభినందించారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లిని మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ గురువారం సన్మానించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిం చడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరాచారు. దీంతో రెగ్యులారిటీ కేటగిరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడమేగాక, స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరచి దేశంలో నెంబర్ వనగ్ నిలిచి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులను గెలుచుకున్నది.
ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లిని శాలువాతో సత్కరించి, పూల మొక్క బహూకరించారు. గురువారం ప్రగతి భవన్ లోని తన కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టుకు వచ్చిందే పల్లె ప్రగతి కార్యక్రమం.
ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేస్తూ మంత్రి ఎర్రబెల్లి ఆయన టీమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా సాధించిన ఫలితంగానే ఈ అవార్డులు, రివార్డులు అని అన్నారు.
దేశంలో మరే రాష్ట్రం సాధించన విధంగా తెలంగాణ రాష్ట్రం అందునా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ఫలితాలు తెలంగాణకే గాక, మొత్తం దేశానికే గర్వకారణం అన్నారు. ఈ ఫలితాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు.
మరింత బాధ్యతాయుతంగా పని చేసి, మరిన్ని ఆవార్డులు తేవాలన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ దేశానికి ఇదే విధంగా ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్ తదితరులు ఉన్నారు.