సిద్దిపేట : బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్లో చాకలి ఐలమ్మ వద్ధంతిని పురస్కరించుకుని ఆదివారంఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అంటూ మంత్రులు నినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వీరనారి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.
సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబీ ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించామని పేర్కొన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు. మంత్రుల వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.