హనుమకొండ : జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్రగాయాలు కావడం పట్ల తీవ్ర విచారం తెలిపారు.
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వాఅండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, శాయంపేట మండలం పత్తిపాక నుంచి మొగుళ్లపల్లికి మిరపతోట పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.