తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ … పీడితవర్గాలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారని, బతుకమ్మ పాటలు, ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్య పరచడంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కాగా, మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆమె ఒక ఐకాన్ లాంటివారని అభివర్ణించారు. నల్లగొండ జిల్లా పోరాట చరిత్రలోనే శాశ్వతంగా నిలిచి పోయే యోధురాలు మల్లు స్వరాజ్యం అని ఆయన కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.