నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏసీసీ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.