హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2022-23 బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని చెప్పారు.
పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలని స్పష్టంచేశారు. పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ఎస్ఈ బలరాం, ఓఎస్డీ రవీంద్రారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.