హైదరాబాద్ : నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు.. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగాలని చెప్పారు. వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.