హైదరాబాద్ : భూసమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో రెవెన్యూ బిల్లులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం తెలిపారు.
1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ధరణిలో నమోదు చేశాం. ధరణి ద్వారా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. ధరణి పోర్టల్ ఆధారంగానే రైతుబంధు ఇస్తున్నాం. కేవలం 15 నిమిషాల్లోనే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా 11 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. 32 రకాల ట్రాన్సాక్షన్స్ ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్లలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి 18 లక్షల ట్రాన్సాక్షన్లు జరిగాయి. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపించింది. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో కేంద్రం విఫలం అయింది.. అని మంత్రి వేముల మండిపడ్డారు.