కుత్బుల్లాపూర్/కమ్మర్పల్లి/హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు తరలించారు. గురువారం తన నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని సాయంత్రం హైదరాబాద్కు బయల్దేరారు. మేడ్చల్ నుంచి కొంపల్లి మార్గంలో చిన్నారితో సహా వెళ్తున్న దంపతులు బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారు.
ఇది చూసిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ని ఆపి, వారి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. మహిళకు స్వల్ప గాయాలు కావడంతో వారిని తన కాన్వాయ్లో ఎక్కించి దవాఖానకు తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.