హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మెతుకు ఆనంద్, రెడ్యా నాయక్, గణేశ్ బిగాల, షకీల్, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, పలువురు అధికారులు ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.