హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటుతో హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరం త్వరలో సరికొత్త శోభను సంతరించుకోనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ 125 అడుగుల విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయించిన విషయం విదితమే. సీఎం ఆదేశాల మేరకు ఈ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలించారు.
విగ్రహ నిర్మాణ ప్రాంగణమంతటా కలియ తిరిగి, అధికారులు, వర్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అంబేదర్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన అభిమానమని, రాజ్యాంగంలో ఆయన పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ సిద్ధించిందని తరుచూ కీర్తిస్తుంటారని గుర్తుచేశారు. అందుకే అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్సాగర్ తీరంలో భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని వివరించారు.
ఏప్రిల్ 14న అట్టహాసంగా జరిగే ఈ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు రానున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 5లోగా అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్సేప్ ఏరియా, రాక్ గార్డెన్, లాన్స్లో ప్లాంటేషన్, పార్లమెంట్ ఆకృతి వచ్చే స్థంభాల సాండ్ స్టోన్ వర్స్, వాటర్ ఫౌంటైన్, పారింగ్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్ క్లాడింగ్ వర్స్, గ్రానైట్ ఫ్లోరింగ్, అధునాతన ఆడియో, వీడియో రూం తదితర అన్ని రకాల పనులకు చార్ట్ రూపొందించుకొని, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, అందుకు సరిపడా మ్యాన్పవర్ను పెంచాలని సూచించారు.
ఈ పనులను రోజువారీగా పర్యవేక్షిస్తానని, వెంటనే ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. కోట్ల మంది భారతీయుల హృదయాలను హత్తుకునే ఈ విగ్రహ ఏర్పాటుకు ప్రతి ఒకరూ మనసు పెట్టి పనిచేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు హఫీజుద్దీన్, లింగారెడ్డి, ఈఈ రవీంద్ర మోహన్, పలువురు అధికారులు, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.