మెండోరా, నవంబర్ 14: ‘కాంగ్రెస్కు ఓటు.. 24 గంటల కరెంట్కు చేటు’ అని మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి వేము ల ప్రశాంత్రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వ్యవసాయానికి సరి గ్గా కరెంట్ ఇవ్వలేక రైతులతో నిరసనలు ఎదుర్కొంటున్నదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని హెచ్చరించారు.