నిజామాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ (CM KCR) అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ (Pension) ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ దవాఖానలకు బలోపేతం చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నారని వెల్లడించారు. తెలంగాణకు బీఆర్ఎస్ (BRS) నాయకత్వమే శ్రీరామరక్ష అన్ని చెప్పారు.