వేల్పూర్, అక్టోబర్ 28: అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని, కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుకే పడుతాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్, బాల్కొండ మండలాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో మంత్రి మాట్లాడారు.
తనకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేసిన కుల సం ఘాలు, దివ్యాంగ కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా వివిధ పార్టీలకు చెందినవారు బీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ, బు స్సాపూర్, నాగపూర్, కిసాన్నగర్, వన్నెల్ (బీ), ఇత్వార్పేట్ గ్రామాలకు చెందిన 650 మంది యువకులకు వేముల గులాబీ కం డు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బా ల్కొం డ మండలంలోని నాగపూర్కు చెందిన తాం బూర్ మున్నూరుకాపు సంఘం సభ్యులు వేముల నాయకత్వానికి జైకొట్టారు. 53 కు టుంబాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.