చిక్కడపల్లి,ఏప్రిల్29: కరోనా సమయంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం సాయంత్రం హిమాయత్నగర్ తాసీల్దార్ కార్యాలయంలో షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.9వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా కాలంలోనూ 2.2 లక్షల మందికి అందించారని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వేలాది మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా చెక్కులు అందించడం జరిగిందని తెలిపారు. కరోనా కేసులు విసృతం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎమ్మార్వో లలిత, రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి, కవాడిగూడ కార్పొరేటర్ జి. రచణశ్రీ, ముఠా జయసింహ, టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. వివేక్, కోటేశ్వరరావు, ఎ.కిషన్రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సరిగిరి కిరణ్కుమార్, జైదేవ్, శివకుమార్యాదవ్, నాగభూషణం, ఇంద్రసేనారెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్ పాల్గొన్నారు.