భీమ్గల్, సెప్టెంబర్ 27 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఉంటామంటూ పలు కుల సం ఘాల వారు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మున్నూరుకాపు పెద్ద సంఘానికి చెందిన 40 కుటుంబాలు, మాల సంఘం 22, ఐతె మున్నూరుకాపు సంఘం 40, మాదిగ సంఘం 50, ఎస్టీ సంఘానికి చెందిన 25 కుటుంబాల వారు కారు గుర్తుకు ఓటు వేసి వేములను గెలిపించుకుంటామని తీర్మానించారు.