హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధారంగా పనులన్నీ ఒకేసారి సమాంతరంగా జరగాలని స్పష్టం చేశారు. మరింతగా వర్క్ ఫోర్స్ పెంచి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. మంగళవారం నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల 4 గంటల పాటు పరిశీలించారు. గ్రాండ్ ఎంట్రీ, రెడ్ శాండ్ స్టోన్ జీఆర్సీ క్లాడింగ్ పనులు, పోర్టికో స్లాబింగ్ పనులు, విండోస్ స్ట్రక్చరల్ గ్లేనింగ్, కాంపౌండ్ వాల్ రెయిలింగ్ పనులు, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్స్, సెక్రటరీల చాంబర్స్, వివిధ శాఖలకు సంబంధించిన వర్స్టేషన్ ఏరియా పనుల పురోగతిని పరిశీలించారు. వర్ స్టేషన్ ఏరియాలో సీటింగ్, కంప్యూటర్తో పాటు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలను పరిశీలించి వర్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. అకడే అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం చాంబర్, మంత్రుల చాంబర్, ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు, గ్రానైట్ ఫ్లోర్ స్టెప్స్ టైల్స్, కోర్ట్ యార్డ్, ప్రైమ్ ఏరియా లైటింగ్ బిగింపును ఫైనల్ చేశారు. సీఎం చాంబర్తో పాటు వీవీఐపీ లాంజ్లో ఉపయోగించే టైల్స్ను పరిశీలించారు. గ్రాండ్ ఎంట్రీ మెయిన్ డోర్కు సంబంధించి ఆరిటెక్ట్ ఆసార్ పొన్ని రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచనలతో ఫైనల్ చేస్తామని తెలిపారు.
అమరుల స్మృతి వనం పనుల పరిశీలన
నిర్ణీత గడువులోగా అమరుల స్మృతి వనం నిర్మాణ పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని మంత్రి వేముల ఆదేశించారు. సచివాలయం నిర్మాణ పనుల పరీశీలించిన అనంతరం అమరుల స్మారక చిహ్నం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం, తెలంగాణ తల్లి విగ్రహం, గార్డెన్ ఏరియా, పై అంతస్థులో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఆకృతి వచ్చే నిర్మాణాన్ని, మ్యూజియం, గ్యాలరీతో పాటు అంతస్థుల వారీగా పనులను పరిశీలించారు. ఈ నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని, ప్రతి పని మనసుపెట్టి చేయాలని అధికారులకు, వర్ ఏజెన్సీకి స్పష్టం చేశారు.