నిజామాబాద్ : ఎడతెరిపి లేకుండా భారీ వార్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామం వద్ద పెద్దవాగు పై తెగిన చెక్ డ్యామ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాల రైతులతో మాట్లాడారు.
అధైర్య పడొద్దు అండగా ఉంటామని రైతులకు మంత్రి భరోసా కల్పించారు. భీంగల్ మున్సిపల్ కేంద్రంలో భీంగల్- వేల్పూర్ వెళ్లే మెయిన్ రోడ్ పైకి సమీప చెరువులు తెగి వరద ప్రవాహం రావడంతో డ్యామేజీ అయిన రోడ్లను మంత్రి పరిశీలించారు. రాకపోకలకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరదలతో నిండి తెగిన మొగిలి చెరువును మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.