హైదరాబాద్ : అమెరికా(America) క్లైమేట్ సైన్స్ కంపెనీ(Climate Science Company) ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) బుధవారం భేటీ అయ్యారు. వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో వ్యవసాయ రంగంలో(Agriculture sector) తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాగులో పురుగు మందులు విధానాలను కంపెనీ ప్రతినిధులు వివరించారు.
సంప్రదాయ పద్ధలకు భిన్నంగా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు పనులు చేపడితే ఎరువులు, పురుగుల మందుల వ్యయం తప్పి సాగు లాభదాయకమవుతుందని వివరించారు. అనంతరం పునరుత్పాదక వ్యవసాయంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.