హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వ్య వసాయ మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించడంతో, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మా ట్లాడారు. రైతులు, వ్యాపారులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కేంద్రం నిధులపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న కోహెడ మార్కెట్ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి, దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుదామని మంత్రి పిలుపునిచ్చారు. టెస్కో, గోల్కొండ హ్యాండిక్రాప్ట్స్, చేనేత అభివృద్ధి కార్పొరేషన్, పవర్లూమ్, టెక్స్టైల్స్ అభివృద్ధి కార్పొరేషన్, టీ ఎస్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టీఎస్ పవర్లూం కార్పొరేషన్పై కార్పొరేషన్లను సమ్మేళనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మార్చి 31 వరకు కొనసాగించేందుకు నిధుల కోసం నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.