హైదరాబాద్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు(Rains) రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని(Stained grain) మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగులో చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రైతులెవరు అధైర్య పడవద్దన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే పంద్రాగస్టు లోపు రుణ మాఫీ చేస్తామని చెప్పారు.