హైదరాబాద్ : హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి తలసాని సవాలు విసిరారు. దమ్ముంటే వారం రోజుల్లో ఆలయం ఎదుట చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ అంబర్పేట డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani Srinivas)మాట్లాడారు.
20 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి(Kisan reddy) అంబర్పేటకు చేసిందేమి లేదని ఆరోపించారు. చర్చకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కులాలు, మతాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ నాయకుల(Bjp)పై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కంటే గొప్ప హిందువు ఎవరు లేరని మరోసారి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట(Yadagiri gutta ) వంటి గొప్ప ఆలయ నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, గొప్పగా పండుగలు నిర్వహించిన కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్, తాగునీటి సమస్యను పరిష్కరించారని వెల్లడించారు. ప్రజలు కూడా ఆలోచించాలని పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని అన్నారు.