Talasani Srinivas yadav | హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ( Telangana ) పోరాటయోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సముచిత గౌరవం కల్పించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas yadav ) స్పష్టం చేశారు. రవీంద్ర భారతి( Ravindra Bharathi )లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య( Doddi Komuraiah ) జయంతి వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. పోరాట వీరుల చరిత్రను గత పాలకులు ప్రపంచానికి తెలియనివ్వకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య వంటి వీరుల పోరాటాలకు గుర్తింపుగా జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కులవృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు లాగే చూశాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.