హైదరాబాద్ : తన ఆట,పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయిచంద్(Sai Chand) అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. గుండెపోటుతో మరణించిన సాయిచంద్ నివాసానికి వెళ్లి పార్దీవ దేహంపై పూలమాలలు వేసి మంత్రి నివాళి అర్పించారు.సాయిచంద్ మరణించాడన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వెల్లడించారు.రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట సాయిచంద్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని అన్నారు. సాయిచంద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.