హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులకు ఆదేశించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో (Decade Celebrations) భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) లో నిర్వహించే ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం తెలంగాణ సచివాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు.
నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను(Nodel Officers) నియమించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఈ విషయం పై ప్రత్యేకంగా సమావేశమై ఉత్సవాలు నిర్వహించే ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.
శాంతి భద్రతల పర్యవేక్షణలో సాధించిన ఘనతను వివరించాలి
శాంతిభద్రతల(Law and Order) పరిరక్షణ కు పోలీసులు(Police) చేస్తున్న కృషి, స్నేహ పూర్వక విధానం, పోలీసు శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి పోలీస్ స్టేషన్ ల వద్ద ప్రజలకు వివరించాలన్నారు. నేరాల నియంత్రణ కోసం ఉపయోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం గురించి కూడా వివరించాలని చెప్పారు. రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా గురించి విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి వివరించాలన్నారు.
ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi) వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ప్రత్యేక సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ లో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రత్యేక కరపత్రాన్ని పంపిణీ చేయాలని తెలిపారు.
నగరంలో తాగునీటి కొరత రాకుండా చేపట్టిన పథకాలను తెలియజేయాలి
నగరంలో రానున్న 50 సంవత్సరాల వరకు త్రాగునీటి సమస్య ఏర్పడకుండా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేసే కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. తెలంగాణ హరితోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలలో, విద్యాలయాలలో ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని(Plantaion) చెప్పారు. పాఠశాలలను మామిడి తోరణాలు, పూలతో సుందరంగా అలంకరించి విద్యార్ధులకు చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించాలని చెప్పారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాలయాలు, చర్చిలు, మసీద్ లు, గురుద్వార్ ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరించి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పూజలు, ప్రార్ధనలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.