తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే ప్రభుత్వం
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
తెలంగాణకు ఏకాణా అయినా తెచ్చారా?
కేంద్ర మంతిగా కిషన్రెడ్డి తెచ్చిన నిధులెన్ని?
బీజేపీ నేతలకు మంత్రి తలసాని ప్రశ్నలు
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘ప్రధాని మోదీ దిగిపోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ను రద్దు చేస్తే అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామా’ అని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఆరు నూరైనా తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ సరారేనని ధీమా వ్యక్తంచేశారు. మోదీకి సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, వాటికి జవాబు చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడి యా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కొన్ని ప్రధాన ప్రశ్నలను మోదీకి సంధించారని, వాటికి ఆయన నుంచి సమాధానం రాలేదని, వాటిని దారి మళ్లించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు పోడు భూములు, ధరణిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూముల అంశం కేంద్ర పరిధిలోనిదని గుర్తుచేశారు. కిషన్రెడ్డి ఎంపీగా కనీసం సికింద్రాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ.లక్ష అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వాడిన కట్టప్ప భాషపైనే సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారే తప్ప, ఆయన రాజ్యసభ సభ్యుడైనందుకు ఎవరికీ బాధలేదన్నారు. యాదాద్రిని ప్రభుత్వ నిధులతో సీఎం కేసీఆర్ పునర్నిర్మించారని, బీజేపీ నాయకులు ఒక్క దేవాలయాన్ని అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. ప్రతి ఒకడు సీఎంను ఏక వచనంతో మాట్లాడటం ఫ్యాషన్గా మారిందని, తాము కూడా మోదీ గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో తెలంగాణలోనే 65 శాతం ఉన్నాయని గుర్తుచేశారు.
బండి కాదు మెంటల్: ఎమ్మెల్యే గోపీనాథ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను మెంటల్ సంజయ్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వర్ణించారు. తక్షణమే ఆయనను మెంటల్ దవాఖానలో చేర్పించాలని బీజేపీ నాయకులకు సూచించారు. మాట్లాడితే గుడులు, మసీదులు తప్ప, బీజేపీకి అభివృద్ధి సంక్షేమం పట్టదని విమర్శించారు. ఐదు రూపాయలకే భోజనం కోసం రూ.183 కోట్లు ఖర్చు చేశామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పనులు చేశారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే రజాకార్ ఫైల్స్ అంటున్నారని, అంతకన్నా ముందే మంచి సినిమా తీసి చూపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.