హైదరాబాద్ : రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీదనే కేంద్రం బతుకుతోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారా? అని ప్రశ్నించారు. పాకిస్తాన్, మతం పేరుతో రెచ్చగొట్టడమే బీజేపీకి తెలిసిందేనన్నారు.
హైదరాబాద్లోనే కాదు.. దేశంలోనూ బీజేపీ గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందని, మోదీకి భయపడే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యక్రమాలపై బహిరంగ చర్చ పెడుదామా? అంటూ సవాల్ విసిరారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు ఏమైనా తెచ్చారా? అని నిలదీశారు. కేంద్రానికి మేం ఇచ్చింది లెక్క చెప్తామన్న ఆయన.. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో కిషన్రెడ్డి చెప్తారా? అని ప్రశ్నించారు.