హైదరాబాద్ : తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. ఈ పూల పండుగను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కళాకారులు, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : ప్రాణం తీసిన ఈత సరదా..ఇద్దరు బాలురు మృతి
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై ఎన్సీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆగని మంట | మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు