హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరి గౌరీ శంకర్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగాఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ రవీంద్రభారతిలో గౌరీ శంకర్ను పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు.