హైదరాబాద్: సాహిత్యానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 11న సాహితీ దినోత్సవం (Sahithi Dinotsavam) నిర్వహిస్తున్నామన్నారు. రవీంద్రభారతిలో (Ravindra Bharathi) సాహితీవేత్తలను ఘనంగా సన్మానిస్తామని వెల్లడించారు. ఈనేపథ్యంలో సాహితీవేత్తలకు వచనం, పద్యం, కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. మొదటి ఐదు రచనలకు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు రోజూ ఒక శాఖ గత 9 ఏండ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచనున్నది. ఇందులో భాగంగా నేడు సంక్షేమ సంబురాలు నిర్వహిస్తున్నారు.