హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud), మహమూద్ అలీ (Minister Mahmood Ali) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ, తెలుగు కవులను మంత్రులు ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో కవి సమ్మేళనాలు జరిపి రాష్ట్రస్థాయి అవార్డులు ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి అవార్డులు అందజేస్తామన్నారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కనిపిస్తుందని చెప్పారు. నాటి ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయాల కోసం మనల్ని వాడుకున్నాయని విమర్శించారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించనుంది.