వనపర్తి : ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి సీఎం కేసిఆర్, బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాయి చంద్ తండ్రి వెంకట్రాములకు రూ.25 లక్షలు, సాయిచంద్ సోదరి ఉజ్వలకు రూ.25 లక్షల చెక్కులను అందజేశారు.
సాయి చంద్ మరణం రాష్ట్రానికి తీరని లోటని మంత్రి తెలిపారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో చేరుగ్గా పాల్గొన్నారని, చిన్న వయసులోనే మృతి చెందడం తెలంగాణ సమాజానికి పూడ్చలేని లోటన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.