మహబూబ్నగర్ : నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అవగాహన సదస్సుకు వెళ్తున్న క్రమంలో.. ఓ పొలంలో నాట్లు వేస్తున్న కూలీలను చూసి మంత్రి ఆగిపోయారు. తన హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిలా మారిపోయారు. నాట్లు వేసే కూలీలతో కలిసి నాట్లు వేశారు. రైతుల మారి పొలంలో ఎరువులు చల్లారు. సాగు పనులు ఎలా ఉన్నాయని రైతుబంధు, ఎరువులు అందుతున్నాయా అని వారిని ప్రేమగా అడిగా తెలుసుకున్నారు.