మహబూబ్నగర్ : మహబూబ్నగర్ (Mahbubnagar) బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ఎన్నికల ప్రచారంలో సొరికొత్త ఒరవడితో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు గల్లీ గల్లీ తిరుగుతూ..చేను చెలకల్లో రైతులు, కూలీలతో మమేకమవుతు..ప్రతి పక్షాలు విస్తుపోయేలా సుడిగాలి పర్యటనలు చేస్తూ వినూత్న రీతిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంత్రి ప్రచార సభకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది.
డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తూ మంత్రికి మద్దతు తెలుపుతున్నారు.
మంగళవారం మహబూబ్నగర్ రూరల్ మండలం బోకొలోను పల్లి, తెలుగు గూడెంలో బైక్పై తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు.
తెలుగు గూడెంలో వేరుశనగ చేను కలుస్తున్న కూలీలను చూసి మంత్రి తన కాన్వాయ్ను ఆపి వారితో కలిసి కలుపు తీశారు. వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు, కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి దీవిస్తే మహబూబ్నగర్ను మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.