మహబూబ్ నగర్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువకుడిని పరామర్శించారు. ఇక్కడి ప్రధాన రోడ్డులో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురైన సంఘటనను మంత్రి చూశారు.
వెంటనే వెళ్లి గాయపడిన బాధితుడిని పరామర్శించారు. ఆపై అతనికి ధైర్యం చెప్పి తక్షణ వైద్యసాయం అందించేందుకుగాను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి తోడుగా తన అనుచరులను కూడా పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రి మంచి మనసును కొనియాడుతున్నారు.