హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఈ నెల 18న వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రూపొందించిన పోస్టర్ను శనివారం మంత్రి హైదరాబాద్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక, ఆరియాలజీ శాఖల సహకారంతో ఆలయం వద్ద ‘శిల్పం, వర్ణం, కృష్ణం-సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ అనే పేరుతో వేడుకలు నిర్వహించనున్నట్టు వివరించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్తో పాటు 300 మంది కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నారాయణ, రాములునాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.