హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబమే టార్గెట్గా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అందులో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ ఈడీలను భ్రస్టు పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల దినోత్సవం రోజు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం మహిళలను గౌరవించకపోవడమేనని అన్నారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదురొనలేక ఎమ్మెల్సీ కవితను అడ్డంపెట్టుకొని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీ గురించి కేంద్రం నోరు మెదపదు కానీ, తన మాటవినని వారిపై కేసులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదన్నారు.