మహబూబ్నగర్/టౌన్, జూలై 30: రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఒకరికేమో కులపిచ్చి ఇంకొకరికేమో మత పిచ్చి ఎక్కినట్టు ఉన్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్లోని టీడీగుట్ట కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుస్మితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు 300 మంది టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నేతలు యువతను రెచ్చగొట్టి కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించా రు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంత అభివృద్ధి పట్టని నాయకులు ఇప్పుడు రాజకీయం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.