రామన్నపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. బసవన్నలతో ఊరేగింపుగా మంత్రి ముందుకు సాగారు. గ్రామ కూడలిలో ఓపెన్ టాప్ జీపులో ప్రసంగించారు.
తాము అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆపదలో ఉన్న వారెవరైనా ఫోన్ చేస్తేచాలు స్పందించి ఆదుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు నవంబర్ 30 తర్వాత అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్లిపోతాయిని, కాబట్టి ప్రజలు వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.