రవీంద్రభారతి, మార్చి 14: పిల్లలను లింగవివక్ష లేకుండా పెంచాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఉమెన్స్ అచీవర్స్ అవార్డ్స్-2024 కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పౌష్ఠికాహారలోపం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
అంగన్వా డీ కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుం చి నర్సరీ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్ కిట్లను అందిస్తామని చెప్పారు. అనంతరం వివిధ రంగా ల్లో రాణిస్తున్న దాదాపు 200 మందికి మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ రంగాల మహిళా ప్రముఖులు పాల్గొన్నారు.