ఆదిలాబాద్ : రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన(Minister Seethakka )కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా పాలనపై ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఆధార్ రేషన్ కార్డుతో పాటు ఒక ఫొటోను జతపరిచి దరఖాస్తు ఫారాన్ని అధికారులకు అందజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.