ములుగు : అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం(Compensation) అందిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) రైతులకు భరోసా కల్పించారు. ములుగు జిల్లా(Mulugu District) రంగాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంగళవారం మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.
రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు(Officials) గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని ఆమె వెల్లడించారు. రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని స్పష్టం చేశారు.
అనంతరం జిల్లాలోని గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో రూ. 75 లక్షల వ్యయంతో పాపయ్యపల్లి ఆర్ అండ్ బీ నుంచి దుంపెల్లి గూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గోవిందరావుపేట మండలం ఫ్రూట్ ఫారమ్ గ్రామంలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్ నిర్మణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.