తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా లోకానికి మల్లు స్వరాజ్యం పోరాటం స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆమె పాత్ర శాశ్వతమని తెలిపారు. ఆమె చేసిన పోరాటాలు.. ఆమె చూపిన తెగువ.. ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన విధానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు సత్యవతి రాథోడ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.