ములుగు జిల్లాలోని మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 40 ఇళ్లు దగ్ధం కావడంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వెంటనే అవసరమైన సాయం అందించాలని, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదంలో నష్ట పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సత్యవతిరాథోడ్ హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. తామంతా అండగా ఉంటామన్నారు.